1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ దర్శకత్వంలో, సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో తెరకెక్కుతోన్న మూవీ ‘రిమ్జిమ్’. అస్లీదమ్ అనే ట్యాగ్లైన్తో సినిమా రూపొందుతోంది. అజయ్ వేద్, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వ్రజన హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ.. రెండు పాటలను పాడారు.
స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ ‘సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు. కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వాసు పెండం సినిమాటోగ్రాఫర్గా, పెనుమత్స రోహిత్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.
